రెండువేల నోటు తీసుకోవాలంటే జంకుతున్న జనం

నకిలీ నోట్ల కలవరంపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) సైతం నివేదిక పంపించాలని సత్తుపల్లి బ్యాంక్‌ అధికారులను ఆదేశించింది. దీంతో ఉలిక్కిపడిన బ్యాంక్‌ అధికారులు ఇటీవల పట్టుబడిన డంప్‌లోని రూ.2వేల నోట్లపై పోలీసులతో సంప్రదింపులు, విచారణ చేపట్టి నకిలీ నోటు కాదని..చిల్ర్డన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా పేరుమీద రూ.2వేల నోటును పోలినవి పట్టుబడ్డాయని తేల్చారు. నకిలీ నోట్లు కాదంటూ ఆర్‌బీఐకు నివేదిక పంపించినట్లు సమాచారం.